24 April, 2026 | 1:08 PM

Breaking News

ఖమ్మం వైరా రోడ్డులో దారుణం.. కత్తులతో పరస్పర దాడి   •   వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే   •   ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు   •   ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ స్వగ్రామం ముత్తోజిపేట ఉద్రిక్తత   •   BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •  

కాంగ్రెస్ నేతల్లో జోష్ లేదు: కేసీఆర్

11-05-2024 02:44 PM

 హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత జోష్ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల్లో లేదని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ సభల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయన్నారుతెలంగాణ భ‌వ‌న్‌లో కేసీఆర్ శనివారం ప్రెస్ కాన్ఫ‌రెన్స్ నిర్వహించారులోక్‌స‌భ ఎన్నిక‌ల నేపథ్యంలో ప్రస్తుత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలపై కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధిపై కాంగ్రెస్ తక్కువ దృష్టి పెట్టిందని ఆరోపించారు. సరూర్ నగర్ కాంగ్రెస్ సభకు కనీసం 3 వేలమంది కూడా రాలేదన్నారు.

రాష్ట్రం దివాళా తీసిందని ఏ సిఎం చెప్పరు.. రాష్ట్రం దివాళా తీసిందనడం వల్ల రాష్ట్ర ఇమేజ్ డ్యామేజ్ అవుతూందని సూచించారు. ఆర్థికపరిస్థితిపై కాంగ్రెస్ చెప్పినవన్నీ తప్పుడు లెక్కలే అన్నారు కెసిఆర్. కాంగ్రెస్ చేసిన తప్పలే లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీని కాటేస్తోందని హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో కరెంట్ కోతలు వర్ణనాతీతం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంట్ కోతలు మళ్లీ ప్రారంభమయ్యాయని తెలిపారు. బీఆర్ఎస్ హయంలో హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ చేశానని కెసిఆర్ చెప్పారు. న్యూయార్క్,లండన్ విద్యుత్ పోయినా హైదరాబాద్ లో పోదు అనే పరిస్థితి ఉండేదని ఆయన పేర్కొన్నారు.