06-08-2025 01:33:52 AM
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): కాళేశ్వరంపై చర్చించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కాళేశ్వరం పైన హరీశ్ రావు, బీఆర్ఎస్ నాయకుల ప్రకటనలు చూస్తుంటే న వ్వు వస్తోందన్నారు.కాళేశ్వరం కూలిపోవడం కూడా మంచిదేనని బీఆర్ఎస్ ఒక సర్టిఫికెట్ తెస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు.
ఈ మే రకు మంగళవార ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మేడిగడ్డ ఎందుకు కూలిపో యిందన్న దానికి సమాధానం లేదన్నారు. కాశ్వరం పైన అన్నింటికి అసెంబ్లీలో సమాధానం చెప్పాలన్నారు. తప్పు చేయకపోతే అ సెంబ్లీలో మైక్ కట్ కాదని, దబాయిస్తమంటే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు.