22-07-2025 10:04:14 PM
గ్రామ కార్యదర్శి హరీష్..
మందమర్రి (విజయక్రాంతి): గ్రామస్తులు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ కార్యదర్శి ఎస్ హరీష్ కోరారు. గ్రామంలో మంగళవారం డ్రై డే కార్యక్రమం(Dry Day programme) చేపట్టారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున వ్యాధుల బారి నుండి ప్రజలను కాపాడేందుక డ్రై డే కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించి ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండటం మూలంగా కలిగే అనర్థాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. నీరు నిల్వ ఉండడం మూలంగా దోమలు వ్యాప్తి చెంది విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులు తమ ఇంటి పరిసరాలలో, మురుగు కాలువల్లో నీరు నిలువ లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఈద లింగయ్య, ఐకెపి విఏవో ఏ తిరుమల, గ్రామస్థులు మేకల లక్ష్మి ముడివెల్లి పద్మ, వజ్రమ్మ, లు పాల్గొన్నారు.