కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి

28-04-2024 01:58:45 AM

మంత్రులు పొంగులేటి, తుమ్మల

ఖమ్మం, ఏప్రిల్ 27 (విజయక్రాంతి) : ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం పాలేరు, ఖమ్మం నగరంలో వేర్వేరుగా నిర్వహించిన సభల్లో వారు పాల్గొని ప్రసంగించారు. పార్టీ గెలుపునకు కార్యకర్తలు సైని కుల్లా పనిచేయాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు. అందరి సహకారంతో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి స్థానంలో కూర్చోబెడదామని అన్నారు.

అధికారం ఉందనే అహంకారంతో విర్రవీగిన బీఆర్‌ఎస్‌కు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని పొంగులేటి అన్నారు. ఆయా సభల్లో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఎంపీ అభ్యర్థి రఘురామిరెడ్డి, కాంగ్రెస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు కళ్లెం వెంకటరెడ్డి, ఖమ్మం నగర శాఖ అధ్యక్షుడు మహ్మద్ జావిద్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పీసీసీ పరిశీలకుడు అశోక్ గౌడ్, నాయకులు రాయల నాగేశ్వర్ రావు, మద్దినేని స్వర్ణకుమారి, రామసహాయం నరేష్ రెడ్డి, మద్ది శ్రీనివాసరెడ్డి, దొబ్బల సౌజన్య, నల్లమల వెంకటేశ్వర్ రావు, జెడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్, ఎంపీపీ రమ్య తదితరులు పాల్గొన్నారు.