1 July, 2026 | 7:45 PM

Breaking News

ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •  

ఉత్కంఠ పోరులో కోల్‌కతా గెలుపు

04-05-2025 07:28 PM

కోల్‌కతా: ఐపీఎల్ 2025 సీజన్-18 లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగినా మ్యాచులో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)పై కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యంతో వచ్చిన రాజస్థాన్ 20 ఓవర్లకు 8 వికెట్లు కొల్పోయి 205 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైస్వల్ (34), రియాన్ పరాగ్ (95), షిమ్రాన్ హెట్మాయర్ (29), శుభమ్ దూబే (25) పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో మోయిన్ ఆలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి తలొ రెండు వికెట్లతో అదరగొట్టారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లకు 4 నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్లలో గుర్బాజ్ (35), నరైన్ (11), కెప్టెన్ అజింక్య రహానే (30), రఘువంశీ (44), చివర్లో ఆండ్రీ రస్సెల్ (57), రింకు సింగ్ (19) పరుగులతో అద్భుతంగా రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యధ్వీర్ సింగ్, తీక్షణ, రియాన్ పరాగ్ చెరొ వికెట్ తీసుకున్నారు.