27-12-2025 12:54:37 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం(Tirumalagiri Mandal) శుక్రవారం రాత్రి తొండ గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన బైక్ ను ఢీకొన్న కారు ప్రమాదంలో మరణించిన మామిడాల గ్రామ వాసి కోమ్ము సురేష్ (34) కుంటుంబ సభ్యులు న్యాయం కోసం జనగాం-సూర్యపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు స్థానికులు గుమికూడడడం, వాహనాలు నిలవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.