18 August, 2026 | 1:20 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

21-09-2025 08:40 PM

రెబ్బెన (విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధుడు, మలి దశ తెలంగాణ ఉద్యమ కారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను రెబ్బెన మండలం గోలేటి గ్రామపంచాయతీలో పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాలను, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గోలేటి పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు గుండేటి వీరస్వామి, ప్రధాన కార్యదర్శి మాంతు సమ్మయ్య, కోశాధికారి మారిన చందర్ మండల పద్మశాలి ఉపాధ్యక్షులు అంకం కైలాసం, వడ్డేపల్లి శ్రీపతి, భోగ రవీందర్ ,చిప్ప శ్రీనివాస్, సాయికిరణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.