21-09-2025 04:58:35 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఆర్డీవో కార్యాలయం వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలవేసి స్వతంత్ర తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి ఉద్యమ సంఘం అధ్యక్షులు బూర ఉమాశంకర్, పద్మశాలి సంఘ నాయకులు చిలుక రమణ, బొద్దుల భాను, అల్లం అశోక్ తదితరులు పాల్గొన్నారు.