1 August, 2026 | 6:10 PM

Breaking News

తల్లిపాలు బిడ్డకు అమూల్యమైన వరం   •   విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తున్న ప్రభుత్వం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి   •   సోనాల మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు   •   అనురాగ్ లో కెరీర్ క్యాటలిస్ట్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఫర్ ప్లేస్మెంట్ సక్సెస్ వర్క్ షాప్   •   గోదావరి ఉధృతి.. జలదిగ్బంధంలో బూర్గంపాడు   •   వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •  

ప్రకృతి కన్నెర్ర.. కుభీర్ రైతులకు భగ్గుమన్న నష్టం

03-10-2025 02:42 PM

కుభీర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో వర్షాలు రైతులకు(farmers) పెద్ద దెబ్బ కొట్టాయి. గత నెలరోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ప్రధాన పంటలు సోయాబీన్, పత్తి తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. చేతికొచ్చిన సోయాబీన్ పంట నీట మునిగి గింజలకు మొలకలు వచ్చి రైతులు భాధపడుతున్నారు. మరోవైపు పత్తి చెట్లపై కాయలు పగిలిపడి, వర్షానికి తడిసి నల్లబడి నేలకొరిగిపోతున్నాయి. దీంతో రైతాంగం కన్నీళ్ల మునిగిపోయింది. మండలంలో మొత్తం 50,788 ఎకరాలు సాగులో ఉండగా, అందులో సోయాబీన్ 22,855 ఎకరాలు, పత్తి 24,066 ఎకరాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాయి. మొక్కజొన్నకు పెద్దగా నష్టం లేకపోయినా, ప్రధానంగా సోయా, పత్తి పంటలే రైతుల కష్టార్జితాన్ని దెబ్బతీశాయి.