15 June, 2026 | 3:03 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

రైస్ పుల్లింగ్ పేరిట 25 లక్షల టోకరా

10-10-2024 12:00 AM

ముగ్గురు నిందితుల అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): రైస్ పుల్లర్ (అతీత శక్తులు కలిగిన రాగి పాత్ర) ఇంట్లో ఉంటే కోటీశ్వరులు అవుతారంటూ ఓ వ్యక్తిని మోసం చేసిన ముఠాను మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర కథనం ప్రకారం.. సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్‌కు చెందిన పగిడిమర్రి శివ సంతోశ్‌కుమార్, ఏపీలోని చిత్తూరుకు చెందిన గుల్లూరు మంజునాథ్‌రెడ్డి, బెంగళూరుకు చెందిన ప్రతాప్ అలియాస్ రవీందర్ ప్రసాద్ ముఠాగా ఏర్పడ్డారు.

రైస్ పుల్లింగ్ పేరిట అమాయక ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించాలని పథకం రచించారు. అందుకు ప్రత్యేకంగా రాగి పాత్రను తయారు చేయించారు. ఈ క్రమంలో వారికి శశికాంత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. రాగి పాత్రను చూపించి, అది ఇంట్లో ఉంటే కోటీశ్వరుడివి అవుతావని నమ్మించారు. అలా శశికాంత్ నుంచి రూ. 25 లక్షలు వసూలు చేశారు.

రాగి పాత్ర నాణ్యత తెలుసుకోవడానికి నిపుణుడిని కలవాలని, అందుకు అదనంగా రూ.23 లక్షలు చెల్లించాలని మళ్లీ కోరారు. దీంతో శశికాంత్ మోసపోతున్నట్లు గుర్తించి మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పోలీసులు రంగంలోకి దిగి నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.