11 March, 2026 | 4:45 PM

Breaking News

మాజీ జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి మృతిపై సంతాపం   •   ఒత్తిడిని వీడి.. పరీక్షలకు సిద్ధం కావాలి: ఏఎస్పీ   •   వాడి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం   •   కుంభాభిషేకం – తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు   •   హేమలత చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్: ఎమ్మెల్యే తలసాని   •   విమానంలో 133 మంది ప్రయాణికులు.. ఎయిరిండియాకు తప్పిన ముప్పు   •   సెన్సెక్స్ 1342 పాయింట్లు కుప్పకూలింది.. పెట్టుబడిదారులకు రూ.3 లక్షల కోట్ల షాక్ — కారణం ఇదే!   •   ప్రాణం తీసిన చేపల వేట.. కృష్ణా నదిలో గల్లంతైన అన్నదమ్ములు   •   భూ మాఫియా చేసింది మీరే.. ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు బినామీలు   •   అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు   •  

మూడుచోట్ల మాదక ద్రవ్యాల పట్టివేత

10-10-2024 12:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): నగరంలోని మూడుచోట్ల ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు, సిబ్బంది దాడులు నిర్వహించారు. గంజాయి పట్టివేత, హషిష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. తెలిసిన వివరాల ప్రకారం.. గోల్కొండ అల్జాపూర్ ప్రాంతంలో హషిష్ ఆయిల్ అమ్మకాలు జరుపుతున్నారనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ సీఐ శిరీష ఆదేశాల మేరకు ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించారు.

నిందితులు సయ్యద్ ఎండీ మజహర్ అలీ, ఎండీ అమీర్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 981 గ్రాముల హషిష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దందాతో ప్రమేయం ఉన్న మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.  అలాగే చార్మినార్ ప్రాంతంలో ఎస్టీఎఫ్ సిబ్బంది దాడులు నిర్వహించారు.

సుమారు రూ.4 లక్షల విలువైన 1.2 కిలోల గంజాయితో పాటు హషిష్ ఆయిల్‌ను స్వాధీ నం చేసుకున్నారు. అలాగే కాచిగూడ ప్రాంతంలో  దాడులు చేసి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రేఖ, ప్రమోద్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.