calender_icon.png 18 June, 2025 | 3:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో భూవివాదం కలకలం

18-06-2025 10:51:55 AM

రాళ్లతో దాడి ఇరువర్గాలకు గాయాలు

పోలీసులు కేసు నమోదు

బెల్లంపల్లి అర్బన్, (విజయక్రాంతి):  మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి మండలం భూవివాదoలో తలెత్తిన ఘర్షణ కలకలం రేపింది. ఈ సంఘటనలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇందులో నలుగురు మహిళలతో పాటు ఇద్దరికీ గాయలయ్యాయి. తాళ్ల గురజాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఆకనపల్లి శివారులో సర్వే నెంబర్ 64 లోని భూమి విషయంలో పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన పనస గణేష్, సిoగతి హైమావతి కుటుంబీకుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది.

ఆకనపల్లి శివారులో భూమిని గణేశ్ దున్ను తున్నాడు. ఈ విషయంలో సిoగతి హైమవతి కుటుంబ సభ్యులు వెళ్ళి గణేష్ ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు  రోడ్డు పైనే తీవ్రస్థాయిలో ఒకరినొకరు దూషించుకున్నాను. అంతటితో ఆగకుండా భౌతిక దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఇరువురు ఒకరిపై ఒకరు ఇచ్చిన పిర్యాదు మేరకు ఇరు కుటుంబ సభ్యులు పైన తాళ్ల గురజాల పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.