calender_icon.png 9 June, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాబినెట్ భేటీలో మా సమస్యలపై చర్చించాలి

05-06-2025 12:45:11 AM

ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): ఇయాళ (గురువారం) జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించాలని ఆర్టీసీ జేఏసీ బుధవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. చట్టవ్యతిరేకంగా ఏర్పాటు చేసిన వెల్ఫేర్ కమిటీలను రద్దు చేయటంతో పాటు యూనియన్లపై ఆంక్షలు ఎత్తేసి ఆర్టీసీ ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, కో చైర్మన్ కే హన్మంతు ముదిరాజ్, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి కోరారు.

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటం, సర్కారే విద్యుత్ బస్సుల కొనుగోలు, ఖాళీల భర్తీ, ఉద్యోగ భద్రతా, మహిళల ఉచిత ప్రయాణం కోసం బస్ పాసుల జారీ, కొత్త బస్సుల కొనుగోలుతో పాటు సర్కారు హామీ ఇచ్చిన మేరకు వెంటనే 3,038 ఆర్టీసీ కార్మికుల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని వారు కోరారు.