19-05-2025 12:00:00 AM
నల్లగొండ టౌన్, మే 18 : రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్ పథకం అర్హులైన నిరుపేద కుటుంబాలకు సైతం అం దని ద్రాక్షగానే తయారైంది. ఒక కుటుంబం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్కు అర్హత సాధించినా.. వంట గ్యాస్ సబ్సిడీ మాత్రం వర్తించకపోవడం విస్మ యానికి గురిచేస్తోంది.
లబ్దిదారులు కలెక్ట రేట్ ప్రజాపాలన కేంద్రాల చుట్టూ ప్రద క్షిణలు చేసి దరఖాస్తులు సవరించు కున్న ప్పటికీ ఫలితం మాత్రం దక్కడం లేదు. ఇటు పౌరసరఫరాల శాఖ కానీ, అటు ఆయిల్ కంపెనీల గ్యాస్ ఏజెన్సీలు కూడా దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. ఫలితంగా నిరుపే దలు నిరాశకు గురవుతూ.. ఎప్పటి మాది రిగానే బహిరంగ మార్కెట్ ధర చెల్లించి వం ట గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రజాపాలన కౌంటర్ల చుట్టూ తిప్పలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల వర్తింపు కోసం సరిగ్గా 16 నెలల క్రితం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించి బీపీఎల్ కుటుంబాలను గుర్తిం చింది. అన్ని పథకాలకు తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు.
అర్హత సాధిం చిన కుటుంబాలకు రెండు వందల యూని ట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 కు గ్యాస్ సిలిండర్ వర్తింపజేశారు. కానీ, సగానికి పైగా కుటుంబాలు కేవలం ఉచిత విద్యుత్ వర్తింపునకు పరిమితమయ్యాయి. సబ్సిడీ గ్యాస్ మాత్రం అందడం లేదు.
ఇదీ పరిస్థితి...
నల్లగొండ జిల్లాలో మూడు కంపెనీల కింద 6,18,701 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో జనరల్ కనెక్షన్లు 4,76,748, దీపం కనెక్షన్లు 82,209, ఉజ్వల యోజన కనెక్షన్లు 59,744 ఉన్నాయి. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో కుటుంబం సంవత్సరానికి సుమారు 6 సిలిండర్లు, పట్టణ ప్రాంతాల్లో సుమారు 8 నుంచి 12 సిలిండర్లను విని యోగిస్తుంటారు.
సరాసరి ప్రతి నెలా 1,55, 000 సిలిండర్లు సరఫరా అవుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా వినియోగదారులపై రూ.77,50,000 అదనపు భారం పడనుంది.
పరిష్కారమేదీ..?
గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాల ఫలాలు వర్తించని కుటుంబాల కోసం దరఖాస్తు సవరణ (ఎడిట్) కోసం కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలు సమ స్యకు పరిష్కారం చూపడం లేదు. ఈ కేంద్రాల్లో పథకాలు వర్తించని దరఖాస్తు దారులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు గ్యాస్కనెక్షన్ నెంబర్,
ఎల్పీజీ కస్టమర్ ఐడీ, మొబైల్ నెంబర్లను సవరించుకునే వెసులు బాటు ఉంది. దీంతో సేవా కేంద్రాలకు క్యూ కట్టి దరఖాస్తులను సవరించుకుంటున్నా.. సమస్యకు పరిష్కారం లభించడం లేదని నిరుపేదలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన వారికి గ్యాస్ సబ్సిడీ వర్తింపజేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.