3 July, 2026 | 11:19 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

తెలుగు నేర్చుకుంటున్నా..

26-07-2024 12:05 AM

తెలుగమ్మాయిని కాకపోయినా ఇక్కడి అమ్మాయిలాగే చూస్తున్నారు అని మురిసిపోతోంది హాసినీ సుధీర్. రాజ్‌తరుణ్ హీరోగా రూపొందిన ‘పురుషోత్తముడు’ చిత్రంలో కథానాయికగా నటించిందామె. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాను న్న సందర్భంగా పాత్రికేయులతో ముచ్చటించిన ఈ మరాఠీ భామ “హీరోయిన్ కావాలన్నది నా చిన్నప్పటి కల. ముంబైలో మోడలింగ్ చేశాను. దర్శకుడు రామ్ భీమన ఆడిషన్ చేసి ఈ పాత్రకు నన్ను ఎంపిక చేశారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు.

ఈ సినిమాలో అమ్ములు అనే పాత్ర పోషించాను. తొలి సినిమాలోనే ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ లాంటి నటులతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. కళ్లతోనే వాళ్లు భావోద్వేగాలన్ని పలికిస్తారు. తొలి సినిమా అన్న భావనను దూరం చేస్తూ సెట్స్‌లో రాజ్‌తరుణ్ సహకారం అందించారు” అంటూ సినిమా సంగతులను పంచుకుంది. తెలుగు సినిమాల మీద మక్కువతో భాష కూడా నేర్చుకున్నా అంటున్న హాసిని.. హీరో నాని తన అభిమాన కథానాయకుడని చెప్పుకొచ్చింది.