02-12-2025 02:16:34 PM
హాజరైన లీగల్ సెల్ సభ్యుడు బత్తుల గణేష్
చిట్యాల,(విజయక్రాంతి): రామన్న పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలనుసారం, మండల న్యాయ సేవా అధికార సంస్థ రామన్నపేట అధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ సి.జగదీష్ సమక్షంలో లీగల్ టీమ్ సభ్యుడు బత్తుల గణేష్ కళాశాలలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేశారు. విద్యార్థులకి అవగాహన విద్యార్దులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్దులు చదువు తో పాటు చట్టాలపై అవగాహన ఉండాలని, బయట సమాజంలో బాలికల పట్ల ఎన్నో రకాల అగత్యాలు జరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత, అవగాహన ముఖ్యం అని అన్నారు. విద్యార్ధులకి ఏదైనా ఇబ్బందులు ఉంటే లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా లీగల్ సర్వీసెస్ దృష్టికి తీసుకువచ్చి, సమస్యలు పరిష్కారం పొందాలని సూచించారు.