2 May, 2026 | 2:31 PM

గుణపాఠాలు అవసరమే

06-06-2024 12:05 AM

ఎన్నికలు వచ్చాయంటే, ట్రెండ్‌కు తగ్గట్టు కొందరు నాయకులు హఠాత్తుగా పార్టీలు  మార్చేస్తుంటారు. అలాంటి వారికి ఏ మాత్రం విలువలు వుండవా? అనిపిస్తుంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అటువంటి కొందరిని ఓడించడం ద్వారా ప్రజలు బాగానే గుణపాఠం చెప్పారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, సునీతా మహేందర్‌రెడ్డి, నీలం మధు, కాసాని జ్ఞానేశ్వర్, గోమాస శ్రీనివాస్, ఆరూరి రమేశ్, దానం నాగేందర్ వంటివారికి పార్టీలు మారినా ఫలితం దక్కలేదు. ఓటర్లు కూడా విచక్షణతో ఓట్లు వేస్తున్నారని దీన్నిబట్టి అర్థమవుతున్నది. ఇకముందైనా ఇలా ఎన్నికల వేళ పార్టీలు మారకుండా ఉంటారేమో చూడాలి.

 బుర్ర రాఘవేంద్ర గౌడ్, గుర్రంగూడ