విలక్షణమైన తీర్పు
06-06-2024 12:05 AM
దేశ ప్రజలు ఎప్పుడూ ఎంతో వివేకంతోనే ఎన్నికల్లో తీర్పులు ఇస్తుంటారు. ఈసారి కూడా 18వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో మొత్తం మీద జనం విలక్షణ తీర్పునే ఇచ్చారు. బీజేపీ కోరుకున్నట్టు 400 స్థానాలకు పైబడి వచ్చివుంటే రాజ్యాంగ మార్పులకు సిద్ధపడుతుందేమో అన్న భయం చాలామందిలో ఏర్పడిన మాట నిజమే. ఆ పార్టీవారు ఎంత వివరణలు ఇచ్చినా ప్రజలు నమ్మిన ట్టు లేరు. అలాగే, కొన్ని ప్రాంతాలలో ఆ పార్టీకి ఎదురుగాలి వీచినట్టుంది. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, మిత్రపక్షాలవైపు ఓటర్లు మొగ్గు చూపారు. ఏమైనా, దేశం మరో ఐదేళ్లపాటు ఎలాంటి అస్థిరతలు, గొడవలు లేకుండా పురోభివృద్ధి దిశగా ప్రయాణించాలని దేశప్రజలు కోరుకుంటున్నట్టుగా దీన్నిబట్టి అర్థమైంది.
కామాక్షి పండిట్, జహీరాబాద్






