calender_icon.png 10 June, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల సమస్యలపై పోరాడుదాం

09-06-2025 10:39:02 PM

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జనగామ జిల్లా ఇంచార్జి మొహమ్మద్ షానూర్ బాబా..

జనగామ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జర్నలిస్టు సమస్యలను పోరాడి సాధిద్దామని తెలంగాణ జర్నలిస్టు యూనియన్(Telangana Journalists Union) జనగామ జిల్లా ఇంచార్జి మహమ్మద్ షానూర్ బాబా(District Incharge Mohammed Shanur Baba) అన్నారు. సోమవారం రోజున తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జనగామ జిల్లా అధ్యక్షులు బూస రమేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జనగామ జిల్లా ఇన్చార్జి షానూర్ బాబా పాల్గొన్నారు. 

అనంతరం మాట్లాడుతూ... పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో  జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగిందని సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్ల స్థలాల సమస్యలు, కార్పొరేట్  హాస్పిటల్ లో హెల్త్ కార్డులు చెల్లకపోవడం, జర్నలిస్టులపై దాడులు పెరగడం, అర్హులైన అందరికీ అందరికీ అక్రీడేషన్ కార్డులు కల్పించాలని,50 సంవత్సరాలు పైబడిన జర్నలిస్టులకు  పింఛన్ సౌకర్యం కల్పించాలని, ప్రతి జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు  రాజేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.