10-06-2025 12:00:00 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, జూన్ 9 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీ లించి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సం దర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ను స్వీకరించారు.
ప్రతి దరఖాస్తులో పేర్కొ న్న అంశాన్ని సమగ్రంగా పరిశీలించి, వాస్తవ స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో శానిటేషన్ చర్యలు నిర్ల క్ష్యం కాకుండా నిర్వహించాలని సూచించా రు. స్కూల్లు, హాస్టళ్ళు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రైతులకు ఎరువులు, విత్తనాల సరఫరాలో ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇం దిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష చే సి, పనుల్లో వేగం తీసుకురావాలని సూచించారు. ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్క శాఖ సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డివో రత్న కళ్యాణి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.