17 April, 2026 | 10:52 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఇంద్రవెల్లి సభను విజయవంతం చేద్దాం

18-04-2025 12:00 AM

ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పిలుపు

ఇంద్రవెల్లి, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఈనెల 20న జరిగే అమరవీరుల సంస్మరణ సభకు రావాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే   వెడ్మ బొజ్జు పటేల్‌కు రగల్ జెండా కమిటీ సభ్యులు కోరారు. ఉట్నూర్ మండల కేం ద్రంలోని క్యాంపు కార్యాలయంలో గురువా రం ఎమ్మెల్యేను కలిసి సభ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ..

రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అమరుల వీరుల సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఆదివాసీలు, మేధావులు, కార్మికులు, కర్షకులు, ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సభకు ము ఖ్యఅతిథిగా ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క రానున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో రగల్ జెండా కమిటీ అధ్యక్షుడు తోడసం నాగోరావు, మాజీ అధ్యక్షుడు కోరెంగ సుంకట రావు, ఆదివాసీ సంఘాలు నాయకులు మెస్రం నాగనాథ్, జుగ్నాక భార త్, దుర్వ ప్రశాంత్ పాల్గొన్నారు.