17 April, 2026 | 10:04 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పార్టీని మరింత పటిష్ఠం చేద్దాం

31-03-2025 01:05 AM
  1. అందుకు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి
  2. హిందువుల ప్రతీ పండుగలో సందేశం ఉంటుంది
  3. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి 

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): కొత్త ఏడాదిలో బీజేపీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేద్దామని, అందుకు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హైదరా బాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆ య న పాల్గొన్నారు.

తెలుగు నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే బూత్, మండల, జిల్లా కమిటీలను పూర్తి చేశామని, త్వరలోనే రాష్ట్ర, జాతీయ కమిటీలు ఏర్పాటు అవుతాయన్నారు. హిందు వుల ప్రతి పండుగలో సందేశంతో పాటు సైన్స్ కూడా దాగిఉంటుందన్నారు.

కులాలకు అతీతంగా సామూహికంగా ప్రజలం దరూ కలిసి ఉండాలనే పండుగలు మనకు సూచిస్తాయనని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మరింత పురోగమించడంతో పాటు ప్రపంచంలో మన దేశ ఖ్యాతి మరింత పెరగాలని ఆకాంక్షించారు.