calender_icon.png 7 June, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైబిజ్ కార్యాలయంలో అందగత్తెలు

07-06-2025 12:00:00 AM

ఆఫీసును సందర్శించిన మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫైనలిస్టులు

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోటీల ఫైనలిస్టులు 30 మంది శుక్రవారం హైదరాబాద్‌లోని హైబిజ్ టీవీ కార్యాలయాన్ని సందర్శించారు. తమ రాష్ట్రా ల సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక సమస్యలపై చర్చించారు.

మిస్ యూనివర్స్ ఏపీ, తెలంగాణ కార్యక్రమంలో మీడియా పార్టనర్‌గా ఉన్న హైబిజ్ టీవీ కార్యాలయాన్ని సందర్శించడం ఆనందంగా ఉందని కంటెస్టెంట్లు అన్నారు. హై బిజ్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ ఎమ్ రాజగోపాల్, హై బిజ్ ఎల్‌ఎల్పి ఎమ్‌డీ జె సంధ్యారాణి, భారతీ సిమెంట్ నుంచి మల్లారెడ్డి.. ఫైనలిస్టులను సన్మానించారు.

7న హైదరాబాద్‌లోని ఆజీజ్‌నగర్, ధారా రిసార్ట్, కన్వెన్షన్లో జరగ నున్న గ్రాండ్ ఫినాలేలో ఈ ఫైనలిస్టులు పోటీపడనున్నారు. ఈ ఏపీ డైరెక్టర్ డాక్టర్ సునీతా, మిస్ యూనివర్స్ తెలంగాణ డైరెక్టర్ ప్రసాద్ గారపాటి, ఏపీ కో-ఆర్డినేటర్ నిరుపమా, తెలంగాణ కో -ఆర్డినేటర్ రితీష్ పాల్గొన్నారు.