06-06-2025 12:31:27 AM
ఒక్కొక్కరు ఆరు వేలి ముద్రలు
నూతన సాఫ్ట్ వేర్తో మరిన్ని కష్టాలు
అసహనం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
మేడ్చల్, జూన్ 5 (విజయ క్రాంతి): రేష న్ బియ్యం కోసం కార్డుదారులు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చుంటున్నారు. బి య్యం తీసుకోవడం లబ్ధిదారులకు పెద్ద స మస్యగా తయారైంది. వర్షాకాలం దృష్ట్యా జూ న్, జూలై , ఆగస్టు నెలలకు సంబంధించి రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
దీంతో ఈ నె ల నుంచి మూడు నెలల సన్న బియ్యం పం పిణీ ప్రారంభమైంది. మూడు నెలల బి య్యం కావడంతో ఆరుసార్లు వేలిముద్రలు వేయాల్సి వస్తోంది. దీనికి తోడు నూతన సాఫ్ట్ వేర్ లో సాంకేతిక సమస్యలు, తరచూ సర్వర్ మొరాయిస్తుండడంతో జాప్యం జరుగుతోంది. చాలామంది డీలర్లకు సాఫ్ట్వేర్ పై అవగాహన లేకపోవడంతో మరింత సమస్య ఎదురవుతుంది.
గతంలో ఒకే నెల రేషన్ బియ్యం కావడంతో లబ్ధిదారులు వెంటనే బి య్యం తీసుకుని వెళ్లేవారు. ప్రస్తుతం మూ డు నెలల బియ్యం కావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాల కింద వచ్చే బియ్యానికి వేరువేరుగా వేలిముద్రలు తీసుకుంటున్నా రు. అంత్యోదయ కార్డుదారులు కేంద్రం వాటర్ కింద రావడంతో ఒకసారి వేలిముద్ర వేస్తే సరిపోతుంది.
ఒక్కొక్కరికి 15 నిమిషాల సమయం
లబ్ధిదారులు ప్రక్రియ పూర్తి చేయడానికి 15 నిమిషాల పైన సమ యం పడుతోంది. దీంతో బియ్యం తీసుకోవడానికి వచ్చిన వారు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల లబ్ధిదారులందరూ బియ్యం తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
అంతేగాక బయటి రాష్ట్రాల వారు కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. మేడ్చల్ జిల్లాలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు చాలామంది ఉపాధి నిమిత్తం వచ్చి ఇక్కడే ఉంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఉన్నాయి. వాటితో దుకాణాలలో బియ్యం తీసుకుంటున్నారు.
జిల్లాలో 618 రేషన్ దుకాణాలు
జిల్లాలో ఆహార భద్రత కార్డులు 544 934 ఉన్నాయి. 618 రేషన్ దుకాణాలు ఉన్నాయి. నెలవారి పంపిణీకి 12310 మెట్రి క్ టన్నుల బియ్యం అవసరం. మూడు నెలలకు 36930 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతుంది.
బియ్యం పంపిణీ వేగవంతమైంది
జిల్లాలో బియ్యం పంపిణీ ప్రక్రియ వేగవంతమైంది. సాఫ్ట్వేర్ సమస్యను పరిష్కరించాం. గురువారం జిల్లాలో ఎలాంటి సమస్య ఎదురు కాలేదు. దుకాణాలు తొందరగా తెరవాలని డీలర్లకు సూచించాం. ఎలాంటి సమస్య ఎదురైన వెంటనే పరిష్కరిస్తున్నాం.
సివిల్ సప్లై డిఎం సుగుణ భాయి