17 April, 2026 | 11:26 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

నా మనసు చెప్పిందే వింటా

29-05-2025 12:00 AM

నిరుడు ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి2898ఏడీ’ చిత్రంలో సుమతి పాత్రలో సందడి చేసింది బాలీవుడ్ నటి దీపికా పదుకొణె. ఆ తర్వాత చివరిసారిగా ‘సింగం అగైన్’లో కనిపించింది.

రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్, కరీనాకపూర్‌ఖాన్, రణ్‌వీర్‌సింగ్, అక్షయ్‌కుమార్ కీలక పాత్రలు పోషించింది. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న దీపికా.. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

జీవితంలో బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలంటే నిజాయితీగా ఉండటమే ముఖ్యమని, తాను దానికే ప్రాధాతనిస్తానని తెలిపింది. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా తన మనసు చెప్పేది వింటానని, ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకుంటానని చెప్పింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటానని తెలిపింది.

అయితే, దీపిక నిజాయితీ గురించి మాట్లాడటం వెనుక కారణం లేకపోలేదని నెటిజన్లు అనుకుంటున్నారు. రెండు రోజులుగా సోషల్ మీడియాలో దీపికా పదుకొణె పేరు వైరల్‌గా మారింది. తన సినిమాను లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఒక స్టార్ డైరెక్టర్ చేసిన ఆమెను ఉద్దేశించే కామెంట్స్ చేశారని, అందుకే తాజాగా దీపిక స్పందించారనేది నెటిజన్ల అభిప్రాయం. ఆ వివాదం నేపథ్యంలోనే దీపికా పరోక్షంగా తాజా నిజాయితీ గురించి మాట్లాడారని అనుకుంటున్నారు.