calender_icon.png 30 May, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీట్ ఎడ్జ్ ఇంటెన్స్ థ్రిల్లర్ చిత్రమిది

29-05-2025 12:00:00 AM

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తాజాచిత్రం ‘మార్గన్’. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై జే రామాంజనేయులు సమర్పిస్తున్నారు.

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా ద్వారా విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ విలన్‌గా పరిచయం అవుతున్నారు. సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, దీష్మిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా జూన్ 27న విడుదల కానుండగా.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. “ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. సీట్ ఎడ్జ్ ఇంటెన్స్ థ్రిల్లర్‌గా ఉంటుంది” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో లియో జాన్ పాల్, రామాంజనేయులు, అజయ్ ధీషన్, దీప్శిఖ, బ్రిగిడా, భాష్యశ్రీ, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.