15-06-2025 01:30:00 AM
నల్లగొండ పట్టణానికి సమీపంలోని పానగల్ ఆర్కియాలజీ మ్యూజి యం అద్భుత కళాఖండాలకు నిలయం. కాకతీయులు, విష్ణుకుండీనులు, కుతుబ్షాహీలు, నిజాము నవాబులు వేయించిన శిలాశాసనాలు, చెక్కించిన శిల్పాలు, వాడిన నాణేలు, వస్తువులు మ్యూజియంలో భద్రపర్చారు. పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరం లో పానగల్ గ్రామం ఉంటుంది. ఇక్కడ జిల్లాలోని వివిధ గ్రామాల్లో పరిశోధనలు చేసి, తవ్వకాలు చేపట్టి లభించిన వస్తువులు ఈ మ్యూజియంలో భద్రపరిచారు.
ఈ మ్యూజియంను 1992, ఫిబ్రవరి 13న అప్ప టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీవీ రంగారావు ప్రారంభించారు. మ్యూజియంలో మొత్తం 647 ప్రాచీన వస్తువులు ఉన్నాయి. ఆదిమానవుల కాలానికి చెందిన రాతి పనిముట్లు, గిన్నెలు, ఆయుధాలను మనం చూడొచ్చు. నవీన శిలా యుగపు, బృహత్ శిలాయుగపు వివిధ రకాల నలుపు, ఎరుపు, మృణ పాత్రలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
అదే విధంగా క్రీస్తుశకం 1వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకూ లభించిన కళాఖండాలను ఇక్కడ భద్రపరిచారు. మ్యూజి యం చుట్టూ పచ్చని చెట్లు, మ్యూజియం వెనకాల ఉదయ సముద్రం రిజర్వాయర్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. క్రీస్తుశకం 2, 3 శతాబ్దాలకు చెందిన ఏలేశ్వరానికి సంబంధించి సున్నపు బొమ్మలు, గారా ప్రతిమలు, సాక్స్టోన్స్ రాతిశిల్పాలు మ్యూజి యంలో ఉన్నాయి.
రాగి శాసనాలు..
రామన్నపేట మండలం ఇంద్రపాల నగరాన్ని పరిపాలించిన విష్ణుకుండీనుల రాజ్యా నికి సంబంధించిన రాగి శాసనాలను ఈ మ్యూజియంలో చూడవచ్చు. ఈ శాసనాల ద్వారా విష్ణుకుండీనులు తమ రెండవ రాజధానిని ఇంద్రపాలనగరంగా చేసుకుని పరి పాలించినట్టు తెలుస్తుంది. పానగల్ను రాజధానిగా చేసుకుని పాలించిన కుందూరు చోళుల శాసనాలు, పశ్చి మ చాళుక్య రాజుల శాసనాలు, కాకతీయ రాజుల శాసనాలు ఈ మ్యూజియంలో మ నకు కనిపి స్తాయి.
ఈ శాసనాలు తెలుగు, కన్నడం, సంస్కృతం భాషల్లో కనిపిస్తాయి. గోల్కొండను పరిపాలించిన కుతుబ్షాహీ రాజుల కాలంలో చెరువులు నింపేందుకు రూపొందించిన ప్రణాళికకు సంబం ధించిన చెరువుల శాసనం కూడా ఇటీవల పానగల్లో బయటపడింది.
3వ శతాబ్దానికి చెందిన నాణేలు..
మ్యూజియంలో 3వ శతాబ్దానికి సంబంధించిన పంచమార్పుల నాణేలు 2,3,4 శతాబ్దాలకు చెందిన రాగి, సీసం, సిల్వర్ నాణేలు కూడా అందుబాటులో ఉన్నాయి. కుతుబ్షాహీ నిజాము నవాబులు, విజయ నగర రాజులు, మొఘల్ కాలం నాటి నాణేలను కూడా ఇందులో భద్రపరిచారు. ఈ నాణేలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.
అద్భుతమైన శిల సంపద..
పానగల్ మ్యూజియం కాంపౌండ్లో అతి ప్రాచీనమైన రాతి శిల్పాలు ఉన్నాయి. 13వ శతాబ్దానికి చెందిన విష్ణువు విగ్రహం. 12వ శతాబ్దానికి చెందిన భైరవుడు, వినాయకుడు, నాగప్రతిమలు ఉన్నాయి. 11వ శతాబ్దానికి చెందిన నంది విగ్రహం కూడా ఉంది. దీంతో పాటు నృత్య కళాకారిణి, ఎలుక, వివిధ జంతువుల విగ్రహాలు ఆవరణంలో ఉన్నాయి. .
పాలరాతి బౌద్ధ శిల్పం
మ్యూజియంలో గల ఆరు అడుగుల పాలరాతి బౌద్ధ విగ్రహం ఆకర్షణీయంగా ఉంది. ఈ విగ్రహాన్ని గుంటూరు జిల్లాలోని అమరావతి ఉత్సవాలు జరిగినప్పు డు అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ కూడా సందర్శకుల మన్ననలు అందుకున్నది. ఈ విగ్రహం దగ్గర నిలబడి అనేకమంది ఫొటోలు, సెల్ఫీలు దిగుతారు.