15-06-2025 12:00:00 AM
-పారమిత హెరిటేజ్ స్కూల్ విద్యార్థినికి అభినందనలు
కరీంనగర్, జూన్ 14 (విజయక్రాంతి): కరీంనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాల విద్యార్థిని ఎస్ శుభశ్రీ రైతుల ప్రయోజనం కోసం వినూత్న ఆగ్రో మెషీన్ను రూపొందించింది. ఇన్స్పైర్ మనక్ అవార్డులో భాగంగా ఈ నెల 15 నుంచి 21వ వరకు జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ నిర్వహించనున్న సకురా సైన్స్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్లో పాల్గొననుందని పాఠశాల హెచ్ఎం గోపీకృష్ణ తెలిపారు.
ప్రస్తుతం సీబీఎస్సీ 12వ తరగతి చదువుతున్న శుభశ్రీ పారమిత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సమయంలో చేసిన ప్రాజెక్టు ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికైందన్నారు. శుభశ్రీ తన గైడ్ టీచర్ లలిత్ మోహన్ సాహు ఆధ్వర్యంలో పర్యావరణ అనుకూలమైన, మల్టిఫంక్షనల్, తక్కువ ధర, పోర్టబుల్ వ్యవసాయ యంత్రాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేసిందని తెలిపారు.
ఈ సందర్భంగా శుభశ్రీని జిల్లా విద్యాధికారి మొండయ్య, జిల్లా సైన్స్ అధికారి జయపాల్రెడ్డి, ఓపెన్ స్కూల్స్ కో ఆర్డినేటర్ నాగేశ్వర్రావు, జిల్లా విద్యాశాఖ కార్యదర్శి స్వదేశ్ కుమార్, పారమిత గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, అనూకర్రావు, రశ్మిత, ప్రాచీ, రమణ, రాకేష్, వీయూఎం ప్రసాద్, వినోద్రావు, టీఎస్వీ రమణ, హన్మంతరావు అభినందించారు.