అద్వానీకి అస్వస్థత
14-12-2024 10:26 AM
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో న్యూఢిల్లీలోని ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు శనివారం తెలిపారు. శుక్రవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మధుర రోడ్డులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఎల్కే అద్వానీ ప్రస్తుతం పరిశీలనలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.






