calender_icon.png 23 June, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘లోకల్’ వార్..

23-06-2025 12:00:00 AM

-జంపింగ్ జపాంగుల టెన్షన్

-స్థానిక పోటీకి యువతలో ఆసక్తి

-ఆశావాహుల గుండెల్లో గుబులు

-పోటీకి ఆశావాల ఏర్పాట్లు

వేములపల్లి, జూన్ 22 : స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రుల ప్రకటనలతో ఆశావాహులలో నూతన ఉత్సాహం నెలకొంది. పంచాయతీ పదవి కాలం గత ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీతో ముగిసింది. ఇప్పటినుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ  ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరగానే ఇతర పార్టీల నుంచి జంపింగ్  జపాంగ్  లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ జంపింగ్ జపాంగులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి చేరుతుంటారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలో నాయకులు.

2014 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీల నుంచి బిఆర్‌ఎస్ పార్టీలోకి చేరారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ కొలువు తీరగానే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి చేరే జంపింగ్ జపంగ్ తలనొప్పిగా మారిందని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఆశవాములు చర్చించుకుంటున్నారు.

పార్టీ కష్టకాలంలో ఉండి పార్టీని బలోపేతం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చాక తాము బరిలో నిలబడితే పార్టీ మారిన వారితో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని ఆశావాహులు  గుసగుసలాడుతున్నారు. ఇలాంటి తలనొప్పులు అధికంగా అధికార పార్టీలో ఉండడం గమనార్హం.

వీరు ఆశావాహులకు కొరకరాని కొయ్యల తయారయ్యారు. మరోవైపు ఎన్నికలు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ రావడంతో నిరాశ చెందారు. తాజా ప్రకటనలతో వారిలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఎలాగైనా  పోటీ చేసి గెలుపొందారు అన్న ఆరాటంతో ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు. 

యువతలో ఆసక్తి..

పంచాయతీ మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయడానికి యువత ఎక్కువగా ఆసక్తి చూపుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు, ఇతర పార్టీలోని గ్రామస్థాయి నేతలు ముఖ్యంగా యువకులు ఎన్నికల బరిలో దిగేందుకు రెడీ అయ్యారు. కొందరు ఇప్పటికే డబ్బులు కూడా సిద్ధం చేసుకున్నారు. మరికొందరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్న పార్టీలు..

ఈసారి మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో జరగబోయే స్థానిక ఎన్నికలను అధికార పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా ఈసారి గెలుపొందాలని పట్టుదలతో ఉన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఇతర పార్టీలు కూడా బలంగానే ఉన్నాయి. అధికార పార్టీ తమ వారిని గెలిపించుకునేందుకు సర్వ శక్తులు ఓడ్డనుంది.