19-06-2025 07:55:34 PM
రాజారామ్ యాదవ్..
సూర్యాపేట (విజయక్రాంతి): యాదవులకు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి పదవి లేకపోవడం బాధాకరమని బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్(BC Jana Sabha State President Rajaram Yadav) అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యాదవ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 30న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద యాదవ ఆత్మగౌరవ ధర్నా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్లో యాదవ మంత్రులు లేకుండా ప్రభుత్వాలు లేవని గుర్తు చేశారు. రాష్ట్ర జనాభాలో 28 లక్షల జనాభా ఉన్న మంత్రి పదవి ఇవ్వకపోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం యాదవులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 10 కోట్లతో యాదవ కార్పొరేషన్ ఏమైందని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు పని చేస్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోడింగ్ గోవర్ధన్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు మేకల కృష్ణ, అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మర్యాద సైదులు యాదవ్, ప్రధాన కార్యదర్శి తూము వెంకన్న యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు తగుల జనార్దన్ యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవ అధ్యక్షుడు సుంకరబోయిన వెంకన్న యాదవ్, మాజీ సర్పంచ్ గుడ్డేటి సైదులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.