calender_icon.png 13 June, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి

13-06-2025 01:00:39 AM

హుజూర్ నగర్, జూన్ 12: ఈనెల 14 న హుజూర్ నగర్ న్యాయస్థానాల ప్రాంగణం లో జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయడానికి న్యా యవాదులు కృషి చేయాలని ఇన్ చార్జ్ జూ నియర్ సివిల్ జడ్జి భవ్య న్యాయ వాదులను కోరారు. కోర్టు ప్రాంగణంలో గురువారం ఆ మె న్యాయవాదులతో సమావేశం నిర్వహిం చి మాట్లాడారు. కేసుల పెండింగ్ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా న్యాయవాదులు కృషి చేయాలని ఆమె కోరారు.

న్యాయస్థానాల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ లకు లోక్ అదాలత్ ను విజయవంతం చేయడానికి త మ వంతు కృషి చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. కక్షిదారులను చైతన్యపరిచి వారి లో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడే వి ధంగా న్యాయవాదులు పోలీసులు కృషి చే యాలన్నారు.

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకునే విధంగా కక్షిదారులను న్యాయవాదులు చైతన్య పరచాలన్నారు. ఈ లోక్ అదాలత్ లో రాజీ పడదగిన అన్ని క్రి మినల్ కేసులు, సివిల్ దావాలు, చెక్ బౌన్స్, ప్రామిసరీ నోట్లు, భూవివాదాలు, కుటుంబ వివాదాలు, రోడ్డు ప్రమాద పరిహార తదితర అన్ని కేసులను పరిష్కరిస్తామని ఆమె వివరించారు.