13-06-2025 12:58:51 AM
పోలీసు, రెవెన్యూ, సబ్రిజిస్టార్, ఎక్సైజ్ శాఖల్లో పచ్చ నోటు లేకుంటే పక్కకు కదలని ఫైల్
నల్లగొండటౌన్, జూన్ 10: ప్రభుత్వ కా ర్యాలయాల్లో ఏ పని కావాలన్నా ‘పైసా వ సూల్‘.. పచ్చ నోటు లేకుంటే ఫైలు కదలని రూల్.. నల్లగొండ జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాలు, సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో క నిపించే దృశ్యం ఇది. ఏసీబీ అధికారుల పనితనాన్ని, ఉన్నతాధికారుల చిత్తశుద్ధిని ప్ర శ్నించే ఈ వ్యవహారం పలు విమర్శలు అం దుకుంటుంది.
ఓవైపు ప్రభుత్వం వివిధ పథకాలతో జనాలను ఆదుకునేందుకు ముందు కు సాగుతుంటే, తమ విధానాలతో ‘సర్కారీ నౌకర్లు‘ జనాల జీవితంతో ఓ ఆట ఆడుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల ను ముక్కుపిండి పైసా వసూలు చేస్తున్న ఘటనలు ఇటీవల మితిమీరిపోతున్నాయి.
రెవిన్యూలో ఇలా..
జిల్లాలో ప్రజలు ఎక్కువ శాతం వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. అ యితే రాజధానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతం స్థిరాస్తి వ్యాపారాల్లోనూ ముందుండటంతో భూమాఫియా కదలికలు ఎక్కువ. ఈ క్ర మంలో రైతుల భూములు, అందులో ఉండే చిక్కులు తీర్చి రక్షణగా నిలవాల్సిన రెవెన్యూ ఉద్యోగులు.. వారి నుంచి అడ్డగోలుగా వ సూళ్లు చేస్తున్నారు.
ఈసీలాంటి చిన్న కాగితా లు కావాల్సిన, పాసుబుక్కులు ఇవ్వాల్సి ఉన్న, ధ్రువపత్రం కావాలన్నా అడిగినంతా ఇవ్వాల్సిందే. భూమి విలువను బట్టి కమిషన్లు వసూలు చేస్తున్న ఉదంతాలు కని సిస్తున్నాయి.
వసూల్ రాజాలుగా పోలీసులు?
జిల్లా పోలీసులకు నేరాల నిరోధన కంటే సివిల్ కేసుల మీదే ఆసక్తి ఎక్కువ. ఇందులో నే ఎక్కువగా అమ్యామ్యాలు వస్తాయన్న ధీ మా కనిపిస్తుంది. డ్రగ్స్, మట్టి తవ్వకాలు, కొండ గుట్టల అక్రమ పేలుళ్లు, సివిల్ కేసుల దందాలు, వివాదాలు, నకిలీ విత్తనాల వంటి అక్రమాలను ఎస్వోటీ పోలీసులు వెలుగులోకి తెస్తుంటే, పోలీసులు మాత్రం సివిల్ కేసుల వెంటపడి ‘వసూల్ రాజా‘లుగా మా రుతున్నారు.
భూముల వివాదాల్లో నేరుగా పోలీసులు తలదూరుస్తున్నారు. సివిల్ కేసులను సైతం క్రిమినల్ కేసులుగా మార్చుతు న్నారు. వాళ్లను ఏదో రకంగా బెదిరించి దా రికి తెచ్చుకుంటున్నారు. ఏదైనా ఫిర్యాదుతో బాధితుడు స్టేషన్కు వెళ్తే అతనితో పాటు అతని ప్రత్యర్థి వద్ద కూడా డబ్బులు వసూలు చేసి డబుల్ ధమాకా లెక్కలు వసూళ్లకు పా ల్పడుతున్నారు. దీంతో స్టేషన్కు వెళ్లేకంటే తమ సమస్యలను తామే పరిష్కారం చేసుకుంటే ఉత్తమమని బాధితులు భావించే పరిస్థితి ఏర్పడింది.
కలెక్టర్ మేడం జర చూడండి
జిల్లాలోని ఆయా ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై స్పందించి వా టిని రూపుమాపాలని ప్రజలు విజ్ఞప్తిచేస్తున్నారు. అడ్డు అదుపులేని లంచావతారం బా గోతాలను భరించలేకపోతున్నామని ఆవేద న వ్యక్తంచేస్తున్నారు.
పైసలు ఇస్తే తప్పా ఫైల్ కదలని పరిస్థితి ఆయా శాఖల్లో కనిపిస్తుందని.. పనికి ఇంత అన్న రేట్లు కూడా కొన్ని శాఖల్లో ఫిక్స్ చేశారని ఆరోపిస్తున్నారు. నల్లగొండ ప్రాంతం ప్రభుత్వ ఉద్యోగుల పాలిట కల్పవృక్షంగా మారిందని, అందుకే ఇక్కడ ఉద్యోగులు పనిచేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారని టాక్.
ఇటీవల సబ్ రిజిస్టార్లో..
సాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి అక్రమా లకు తావు లేకుండా రాష్ట్ర ప్రభు త్వం ఇటీవల స్లాట్ బు కింగ్ విధానంతో పా టు మరి కొన్ని మార్పులు చేసింది. అయినా పాత పద్ధతిలో అక్రమ వసూళ్లు జరుగుతు న్నా యని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి క్రయ, విక్రయ దారులతో పాటు ఇతర ధ్రువపత్రా లు వెళ్లిన వారి నుంచి యథేచ్ఛగా దోచుకుంటున్నారు.
ఇక్కడ పనిచేసే వారితో పాటు కార్యాలయంతో సంబంధం లేని వారు, బయటి వ్యక్తుల ఆగడా లకు అదుపు లేకుం డా పోయింది. నిబంధనలకు విరుద్ధంగా సబ్ రిజిస్టర్ 1 మైనర్ పేరుతో ఉన్న ఆస్తిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారు. ఇలాంటివి గడిచిన మూడు నెలల్లో 5 వరకు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారాల్లో పెద్ద మొత్తం లో డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తుంది.
ఎంసీల ప్రభుత్వ ధర రూ. 110 ఉంటే రూ. 300 నుంచి 400 వసూలు చేస్తున్నా రు. సీసీల ధర రూ. 510 ఉంటే రూ 1000 నుంచి రూ. 1300 వసులు చేస్తున్నారు. వివాహ ద్రవపత్రాలకు రూ.220 గా ఉంటే రూ. 1000 ఈసీలు రూ. 510 అయితే 1000 రూపాయలుగా ప్రత్యేక ధరలు నిర్ణయించి వసూలు చేస్తున్నట్టు సమాచారం.