l అందుకే కాంగ్రెస్లోకి భారీగా చేరికలు
l మంత్రి దామోదర రాజనర్సింహ
అందోల్, మే 1: బీఆర్ఎస్పై ప్రజలకు నమ్మకం పోవడంతోనే ఆ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి భారీగా వలసలు వస్తున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం మునిపల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులతో పాటు ఆయా గ్రామాల మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, నాయకులు సుమారు 500మందికి పైగా రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సంగారెడ్డిలోని మంత్రి నివాసంలో వారికి కాంగ్రెస్ కండువా కప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటుందన్నారు. అభివృద్ధికి ఆదర్శం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు.