15-11-2025 01:18:12 AM
డిచ్ పల్లి నువంబర్ 14:( విజయక్రాంతి): ఆగస్టు/ సెప్టెంబర్ లో నిర్వహించిన ఎం.ఎ/ ఎం కామ్/ ఎమ్మెస్సీ 32 కోర్సుల నాలుగవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు ఆదేశాల మేరకు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఏం యాదగిరి, కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్ కుమార్, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్ లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కంట్రోలర్ లు, డాక్టర్ నందిని, డాక్టర్ శాంతాబాయి డాక్టర్ తోకల సంపత్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ పున్నయ్య లు పాల్గొన్నారు.