6 June, 2026 | 6:43 PM

Breaking News

గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలి: ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి   •   లింగారెడ్డిగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   ప్రణాళికాబద్ధంగా కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసుకుందాం   •   ఫార్మర్ రిజిస్టీ తప్పని సరి   •   వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •  

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

15-11-2025 01:15 AM

అర్మూర్, నవంబర్ 14 (విజయ క్రాంతి) : అర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న పాలిత కుమార లహరి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అర్మూర్ ఎస్.హెచ్.ఓ. సత్యనారాయణ తెలిపారు. రెండు రోజుల క్రితం ఇంటి నిర్మాణ పనుల్లో ఉండగా తన చేతిలోని అల్యూమినియం పట్టి బిల్డింగ్ పైన ఉన్న కరెంట్  వైర్లకు ప్రమాదవశాత్తు తాకి కరెంట్ షాక్ తగిలి పడిపోయినట్లు తెలిపారు. చికిత్స నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.హెచ్.ఓ. వివరించారు.