14-02-2026 12:07:52 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 13(విజయక్రాంతి) : మున్సిపల్ ఎన్నికల్లో మూడుచింత లపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపూర్ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బుట్టంగారి మాధవరెడ్డి బీసీల ఉసురుతగిలి ఓటమి పాలయ్యారని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటన లో పేర్కొన్నా.
బీసీల నోటికాడు ముద్దను గుంజుకుని, బీసీల తినే కంచంలో మన్ను పోసిన మాధవరెడ్డిని ఓటు ఆయుధంతో ఓ డించాలని తాము ఇచ్చిన పిలుపును గౌరవించి కేశవపూర్ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మద్దతు పలికే అగ్రకుల ప్రజాస్వామ్యవాదు లు ఒక్కటై తగిన శాస్తి చేశారని అన్నారు.
ఇందుకు రాష్ట్రంలోని మూడు కోట్ల మంది బీసీ ప్రజల తరఫున కేశవాపూర్ వార్డు ప్రజలకు అభినందనలు తెలియజేశారు. బీఆర్ఎ స్ పార్టీ, మాధవరెడ్డిని గెలిపించాలని ప్రచా రం నిర్వహించిన చామకూర మల్లారెడ్డి ఇప్పటికైనా తక్షణమే బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు లేనిపక్షంలో బీసీ సమాజం ముందు బీఆర్ఎస్ను, మల్లారెడ్డిని దోషిగా నిలబెడతామని ఆయన హెచ్చరించారు.