20-06-2025 12:02:29 AM
సుడా చైర్మన్ తో కలిసి వీధిదీపాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
మానకొండూర్, జూన్19(విజయక్రాంతి):గన్నేరువరం మండలం గుండ్లపల్లి క్రాస్ రోడ్డులో సుడా నిధుల 35లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన వీధిదీపాలను సుడా చైర్మన్ తో కలిసి మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బుధవారం సాయంత్రం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సుడా పరిధిలోని గ్రామాలకు మహర్ధశ పట్టనున్నదన్నారు.
సుడా నిదులతో మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. అడిగిన వెంటనే పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నారంటూ సుడా చైర్మన్ ను ఆయన కొనియాడారు.శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సుడా పరిధిలోని గ్రామాలకు అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
ఇప్పటికే పలు అభివృద్ధి పనులు నిధులు కేటాయించామని, ఇక ముందుకు నిధులు మంజూరు చేసి అభివృద్ధికి పాటుపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, పార్టీ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, బే తి రాజేందర్ రెడ్డి, వంగల సత్తిరెడ్డి, ముల్కల మల్లేశం, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మోరపల్లి రమణారెడ్డి తదితరులుపాల్గొన్నారు.