20-06-2025 12:00:58 AM
కరీంనగర్, జూన్ 19 (విజయ క్రాంతి): కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ గ్రామం స్టేజి వద్ద 20 లక్షల నదులతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వర్షాలు పడ్డప్పుడు వరద నీళ్లు షాపులకు ఇండ్లకు వచ్చి చేరి ఇబ్బందులు పడుతున్నందున స్థానిక నాయకులు సు డా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకెలాగా స్పందించినా ఆయన శాశ్వత పరిష్కారం కోసం 20 లక్షలు సుడా నిధులతో డ్రైనేజీ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడానికే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అభివృద్ధి సంక్షేమం రెండింటిని సమదృష్టితో చూస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షులు బుర్ర హరీష్ గౌడ్, మాజీ సర్పంచ్ గాజుల అంజయ్య, మాజీ ఉపసర్పంచ్ సుంకిసాల సంపత్ రావు, జగ్గని కనకయ్య, బుర్ర గంగయ్య, గాజుల క్రాంతి, గాదె శివరామ్, బెజ్జంకి శేఖర్,అనుముల తిరుపతి, తదితరులుపాల్గొన్నారు.