1 April, 2026 | 2:36 AM

కామారెడ్డి మార్వాడి సంఘం ఆధ్వర్యంలో మహావీర్ జయంతి

01-04-2026 12:34 AM

కౌన్సిలర్ దంపతులకు సన్మానం 

కామారెడ్డి, మార్చి 31 (విజయక్రాంతి): మహావీర్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రం, సిరిసిల్ల రోడ్డులో గల మార్వడి ధర్మశాలలో మహావీర్ 2625 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్వాడి సంఘం ప్రతినిధులు కామారెడ్డి 46 ,47 వార్డుల కౌన్సిలర్ దంపతులు గేరు గంటి స్వప్న, లక్ష్మీనారాయణలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మార్వడి సంఘం అధ్యక్షులు, ఆర్.బి నరేష్ చంద్, ప్రధాన కార్యదర్శి, బోర ప్రదీప్ జైన్, ఉప అధ్యక్షులు,దిలీప్ చంద్, కోశాధికారి,మహేష్ కుంచ, ఉపకార్యదర్శి, ఓం చంద్, తదితరులు పాల్గొన్నారు.