15 June, 2026 | 1:54 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్..?

03-07-2024 12:42 AM

ఖర్గేతో భేటీ 

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి):  పీసీసీ నూతన అధ్యక్షుడు ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పార్టీ అధిష్ఠానం కొత్త బాస్ నియామకంపై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఖర్గేను  మహేష్‌గౌడ్  కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పీసీసీ చీఫ్‌గా ఆయన పేరు ఫైనల్ అయిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ పదవి బీసీ వర్గానికి ఇస్తారని మొదటి నుంచి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కొత్త బాస్ విషయంలో  అధిష్ఠానం ముఖ్యనేతల  అభిప్రాయం తీసుకున్నట్టు తెలిసింది.