25-05-2025 12:39:27 AM
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, కల్లుగీత పారిశ్రామిక చైర్మన్ నాగరాజు గౌడ్, మహిళా కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ చెర్మైన్ శివసేన రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, నాయకులు బండి శ్రీనివాస్ గౌడ్, బాలప్ప, నర్సింహా రావు, బండి సాయి గౌడ్, పూర్ణచందర్, మురళి, వీరబాబు, బుచ్చి రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.