12-11-2025 04:43:16 PM
తాండ్ర అంజయ్య...
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సిఐటియు పెద్దపల్లి జిల్లా మహా సభలను జయప్రదం చేయాలంటు బుధవారం స్థానిక రైస్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు సుల్తానాబాద్ మండల కన్వీనర్ తాండ్ర అంజయ్య మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా 4వ మహాసభలు నవంబర్ 16న పెద్దపల్లి ఎంబి గార్డెన్స్ లో జరుగుతున్నాయని, ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్, వీరయ్య, భూపాల్, తుమ్మల రాజారెడ్డి పాల్గొంటారని, ఈ మహాసభల్లో జిల్లాలోని వివిధ రంగాల కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని, ఈ మహాసభల్లో జిల్లాలోని అన్ని రంగాల ఉద్యోగులు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రైస్ మిల్ గుమస్తాల సంఘం అధ్యక్షులు మాతంగి రాజమల్లు, రైస్ మిల్ ఆపరేటర్ల సంఘం ప్రధాన కార్యదర్శి నౌవుండ్ల బ్రహ్మచారి, పూసాల సంపత్, శంకర్, వేగోళం అనిల్ గౌడ్, ఉస్తే ప్రశాంత్, స్వామి, శీను, కనకయ్య, అంజయ్య, కొల్లూరి రాజు, సతీష్, కుమార్, రఘుపతి రెడ్డి, సదానందం, రవి, మహేష్, వేణు, రాజేశం, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు