సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు
మహబూబాబాద్, జూన్ 27 (విజయ క్రాంతి): దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు కుమ్మరి కుంట్ల నాగన్న , పర్వత కోటేష్ కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ అధికారికి జూలై 9న చేపట్టనున్న సార్వత్రిక సమ్మె నేపథ్యంలో విధులకు హాజరుకామని సమ్మె నోటీసు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 8 గంటల పని దినాన్ని కాపాడుకోవాలని, అంగన్వాడి, ఆశ, మున్సిపల్ గ్రామపంచాయతీ, ఐకెపి, వివోఏ లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులు, కష్టజీవులు, విద్యార్థులు, మేధావులు, రైతులు, రైతు కూలీలు అధిక సంఖ్యలో సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సారయ్య, రాములు, జనార్ధన్, రవి, హేమ, వెంకన్న, ప్రవీణ్, సుధాకర్ పాల్గొన్నారు.




