calender_icon.png 8 June, 2025 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్షయ తృతీయకు మలబార్ గోల్డ్ ప్రత్యేక ఆఫర్లు

24-04-2025 01:28:13 AM

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): బాధ్యతాయుతమైన ఆభరణాల వ్యాపార సంస్థగా ప్రఖ్యాతిగాంచిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, అక్షయ తృతీయను పురస్కరించుకొని వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. బంగారు ఆభరణాల తరుగు చార్జీలపై 25% వరకు తగ్గింపు, ఫ్రీసియస్ స్టోన్స్ అండ్ ఆన్ కట్ డైమండ్స్ ఆభరణాల తరుగు చార్జీలపై ఫ్లాట్ 25% తగ్గింపు, వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపు ఇవ్వనున్నట్టు గుంటూరు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ స్టోర్ హెడ్ నదీర్..

మార్కెటింగ్ మేనేజర్ గోపికిరణ్ తెలిపారు. అయితే షరతులు వర్తిస్తాయని వెల్లడించారు. ‘ఎంతో విలువైన వృత్తి నైపుణ్యం మేళవించిన ఆభరణాలలో వినియోగదారులు కొనుగోలు చేయడానికి ఈ పండగ ఆఫర్లు అసాధారణమైన అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ పండగ కొనుగోలు అనుభూతిని మరింత లాభదాయకంగా మార్చడానికి అడ్వాన్స్ బుకింగ్‌తో ఉచితంగా వెండి నాణ్యాన్ని అందిస్తున్నాం.

వినియోగదారులు తాము కొనుగోలు చేయాలనుకునే ఆభరణాల మొత్తం విలువలో కనీసం 10% చెల్లించి తమ ఆభరణాలను బుక్ చేసుకోవచ్చు. బంగారం ధరల పెరుగుదల నుంచి రక్షణ పొందొచ్చు. బంగారం బుక్ చేసిన రోజు మార్కెట్ ధర లేదా ఆభరణాలు తీసుకొనే రోజు మార్కెట్ ధర ఈ రెండిటిలో ఏది తక్కువైతే దాన్ని తుది ధరగా నిర్ణయిస్తారు. తద్వారా కష్టమర్లకు సాధ్యమైనంత ఉత్తమ ధర లభిస్తుంది’ అని వెల్లడించారు.