24-04-2025 01:28:08 AM
మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): కశ్మీర్లోని పహల్గావ్ లో పర్యాటకులపై పాకిస్థాన్ ముష్కరుల ఉగ్ర దాడిని ఖండిస్తూ మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ నుండి తహసీల్ చౌరస్తా వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని, ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ కొవ్వొత్తులు పట్టుకొని, శాంతి ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి తహసీల్ చౌరస్తాలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూభారత దేశ సార్వబౌమత్వాన్ని ప్రశ్నించే విధంగ దాడులు చేసిన ఉగ్రవాదుల పై ఉక్కుపాదం మోపాలన్నారు.