04-08-2025 01:44:31 AM
మాజీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్
భోపాల్, ఆగస్టు 3: మాలేగావ్ పే లుళ్లు కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రే అని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఆదివారం ఆరోపించారు. ‘పార్టీ ఓటు బ్యాంకును సంతృప్తి పరిచేందుకు, బీజేపీని ఇరికించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్ర యత్నించింది.
కోర్టు తీర్పు కాంగ్రెస్ కు చెంపపెట్టులాంటిది. కాంగ్రెస్వి మతతత్వ రాజకీయాలు.. 2008 సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా త ప్పుడు కేసుల్లో నన్ను ఇరికించాలని చూసిం ది’ అని ప్రజ్ఞాసింగ్ ఆరోపించారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో ఇటీవలే ప్రజ్ఞాసింగ్ను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.