22-12-2025 05:46:39 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కాల్వపల్లి తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా మాలోతు సక్రు నాయక్ సోమవారం అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు కార్యకర్తలు యువత అందరూ ఊరేగింపు గా బయలుదేరి గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ క్రాంతి, కార్యదర్శి సమక్షంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తండా ప్రజలు నా మీద నమ్మకంతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. పార్టీలకు అతీతంగా సేవా చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం గ్రామ పెద్దలను సన్మానించారు.ఈ ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిథిగా మఠంపల్లి మాజీ జెడ్పిటిసి సైదులు తదితరులు పాల్గొన్నారు.