14 April, 2026 | 5:14 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

06-10-2025 08:27 PM

కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డ మృతుడు..

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: కుటుంబ కలహాలతో వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం మండల పరిధిలోని సీతారాంపురం గ్రామ సమీపంలోని గుట్టలో చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా కోటపేట గ్రామానికి చెందిన పూసల బద్రి(45) సంచార జాతులకు చెందడంతో తిరుమలగిరిలోని దిష్టి బొమ్మలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. భార్యతో గొడవపడి మనస్థాపం చెంది సీతారాంపురం గుట్ట వద్దకు చేరుకొని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.