30 July, 2026 | 5:48 PM

Breaking News

గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •   భారీ వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు   •  

ఫుట్ పాత్ ను ఢీకొని వ్యక్తి దుర్మరణం..

06-10-2025 08:40 PM

ఉప్పల్ (విజయక్రాంతి): బైకు అదుపుతప్పి ఫుట్ పాత్ ను ఢీకొని  వ్యక్తి దుర్మరణం జరిగిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నాచారం సబ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ మండల్ చెంగిచెర్లకు చెందిన దిలీప్ కుమార్ ప్రైవేటు ఉద్యోగి నాచారంలోని ఈనెల ఐదో తారీఖు నాడు తన స్నేహితుడి బర్తడే పార్టీకి వచ్చి తిరిగి వెళ్తుండగా నాచారం ఐఐసిటీ గేటు సమీపంలో బైక్ అదుపుతప్పడంతో పక్కనే ఉన్న ఫుట్ పాత్ ను ఢీకొనడంతో తలకు తీవ్రమైన గాయమైంది. 108 సాయంతో ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.